Maoist Party Bandh: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టుల అణచివేత ముమ్మరమైంది. దీనికి నిరసనగా మావోయిస్టు నేతలు జూన్ 20న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బంద్కు పిలుపునిచ్చారు. జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. బలగాలు ఏఓబీ, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశాయి. తనిఖీలు ముమ్మరమయ్యాయి. ఈ ఆపరేషన్లో వందల సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించారు. మానవ హక్కుల సంఘాలు ఈ చర్యలను ఖండిస్తున్నాయి. శాంతి చర్చలకు పిలుపునిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏరివేతనే లక్ష్యంగా పెట్టుకుంది.