మార్చి 28న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కోసం తెలంగాణ పోలీసు శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. డీజీపీ శివధర్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యాం కోశీతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీజీపీ వివరించారు. రాజీపడదగ్గ కేసులను గుర్తించి, కౌన్సెలింగ్ ద్వారా ఇరుపక్షాలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.