రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఏడు మండలాల బదిలీపై కిషన్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని, విభజన చట్టాన్ని సవరించి ఆ మండలాలను ఏపీకి ఇచ్చింది బీజేపీయేనని గుర్తు చేశారు. కాళేశ్వరంపై కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఒకే భాష మాట్లాడుతున్నారని, ఇది వారి మధ్య ఉన్న పొత్తుకు సంకేతమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఎకనామిక్ సర్వేనే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసించిన విషయాన్ని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.