వర్షాకాలంలో సంభవించే పిడుగుపాట్లను ముందుగానే తెలుసుకోవచ్చు. కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ రూపొందించిన దామిని యాప్ ద్వారా మీరు ఉన్న ప్రాంతంలో 25 నిమిషాల్లో పిడుగు పడే అవకాశాన్ని ముందుగానే హెచ్చరిస్తుంది. స్మార్ట్ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే.. ప్రాణ, ఆస్తి నష్టం నుంచి బయటపడొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం..