తెలంగాణలోని రెండు జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా కస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించనన్నట్లు స్పష్టం చేశారు. నేషనల్ హైవే 163 కి ఇరువైపుల హైదరాబాద్, వరంగల్ పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి వెల్లడించారు.