ఓ యువకుడ్ని పెళ్లి పేరుతో ఓ మహిళ మోసం చేసిన సంఘటన చూస్తే.. దెబ్బకు పెళ్లి అంటేనే పారిపోతారు. వివాహమైన వారానికే ఆమె యువకుడికి ఎలా హ్యాండ్ ఇచ్చిందో చూస్తే ముక్కున వేలేసుకుంటారు. వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన యువకుడు రాజశేఖర్ రెడ్డి బాగా చదువుకున్నాడు. అతడు ప్రస్తుతం బెంగళూరులోని ఓ ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని భావించి కొంతకాలంగా.. మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తున్నాడు. ఈ ప్రయత్నాల్లో రాజశేఖర్ రెడ్డికి అతడి స్నేహితుడైన కృష్ణారెడ్డి ద్వారా గుంటూరుకు చెందిన మల్లేశ్వరి, మంగళగిరికి చెందిన కొండలమ్మ అనే ఇద్దరు మహిళలు పరిచయం అయ్యారు. ఆ ఇద్దరు మహిళలు ఓ అమ్మాయి ఉందని.. పెళ్లి చేస్తామని యువకుడ్ని నమ్మించారు.తమకు తెలిసిన కరుణావతి అనే యువతికి తల్లిదండ్రులు లేరని.. ఆమెతో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తామన్నారు. కాకపోతే ఆ యువతికి ఎదురు కట్నంగా డబ్బుల ఇస్తే పెళ్లి చేస్తామని మాయ మాటలు చెప్పారు.