బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి ఈటలకు లేదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కని కోపంతో ఈటల రేవంత్ను దూషిస్తున్నారన్నారు. దేవాదాయ భూముల కబ్జా కేసును గుర్తుచేస్తూ.. రేవంత్ను విమర్శించే నైతిక హక్కు లేదని ఫైరయ్యారు. బీజేపీ నేతలు తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని.. బీసీ బిల్లు విషయంలో వారి వైఖరిని బీసీ సమాజం క్షమించదని అన్నారు.