హైదరాబాద్కు చెందిన ఓ లేడి డాక్టర్.. ఇద్దరు స్నేహితులతో కలిసి కర్ణాటకలోని హంపీకి విహారయాత్రకు వెళ్లగా.. తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రలో భాగంగా.. సరదాగా ఈత కొట్టాలని భావించిన మహిళా వైద్యురాలు.. తుంగభద్ర నదిలో దూకింది. కాసేపటికే నదిలో ప్రవాహం ఎక్కువవటంతో.. వైద్యురాలు కొట్టుకుపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టగా.. గురువారం (ఫిబ్రవరి 20) ఉదయం మృతదేహం లభ్యమైంది. దీంతో.. కుటుంబసభ్యులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు.