ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. యండగండి - కోలమూరు కాలువ పనుల ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉండి నియోజకవర్గంలోని అన్ని కాలువలు త్వరలో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా కాలువల్లో చెత్త వేస్తే జరిమానా విధించే వినూత్న కార్యక్రమాన్ని రఘురామ ఉగాది సందర్భంగా ప్రారంభించారు. జరిమానా సొమ్మును కాలువల అభివృద్ధికి వినియోగిస్తామని ఆయన పేర్కొన్నారు.