ఉగాది, రంజాన్ పండగల రద్దీని దృష్టిలో ఉంచుకుని TGSRTC ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. మార్చి 17, 18 23 తేదీల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ స్పెషల్ బస్సులు నడుపుతుండగా.. ఇందులో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. జీవో 16 ప్రకారం ఈ సవరణ చేస్తున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. అయితే, రెగ్యులర్ బస్సుల్లో పాత ధరలే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.