ఉగాదికి కొత్తింటిలోకి గృహ ప్రవేశాలు లేనట్లే.. ఆ జిల్లా ప్రజలకు బ్యాడ్ న్యూస్..

2 hours ago 2
ఉగాది పండుగ సందర్భంగా పేద ప్రజలకు ఇళ్ల పంపిణీ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. అనుకున్న మేరకు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయలేకపోవటంతో ఉగాదికి కొత్త ఇళ్లల్లోకి గృహ ప్రవేశాలను వాయిదా వేశారు. వారంలోగా గృహ ప్రవేశాలు ఎప్పుడనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పశ్చిమగోదావరి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. వందల్లోనే పూర్తి కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Read Entire Article