ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మహిళల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీన్ని ద్వారా రాష్ట్రంలోని మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. ఈ ఉచిత బస్సు ప్రయాణానికి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇదిలా ఉంటే మంత్రి సత్య కుమార్ యాదవ్ మాత్రం ఉచిత బస్సు ప్రయాణంపై సెటైర్లు వేశారు. తోటికోడళ్లు గతంలో మాదిరి ఫోన్లలో కాకుండా.. ఇప్పుడు బస్సుల్లో వెళ్లి మరీ గొడవపడి వస్తున్నారంని కామెంట్స్ చేశారు. ఆ వివరాలు..