తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కొత్త వివాదాలు తలెత్తుతున్నాయి. ఆధార్ కార్డులలో చిరునామా వద్ద ఆంధ్రప్రదేశ్ అని ఉండటం, ఫొటోలు అప్డేట్ చేయకపోవడంతో కండక్టర్లు టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో ఆర్టీసీ సిబ్బందికి, మహిళలకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆధార్ కార్డు మీద తెలంగాణ అని మార్చుకోవాలని.. అలానే ఇప్పుడున్న ఫొటోను మార్చాలని సూచిస్తున్నారు. ఈ రెండు పనులు చేయకపోతే అలాంటి వారికి జీరో టికెట్ ఇచ్చేది లేదని ఆర్టీసీ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఆ వివరాలు..