కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఉడాన్ 2.0' పథకం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విమానయాన సౌకర్యాలు భారీగా మెరుగుపడనున్నాయి. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్లోని నాగార్జునసాగర్లలో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఉడాన్ 2.0 కింద కేటాయించిన రూ.28,000 కోట్లతో దేశవ్యాప్తంగా 100 ఎయిర్పోర్టులు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయనున్నారు.