ఆదిలాబాద్లో రక్షణ, పౌర అవసరాలకు కలిపి ఉపయోగించే జాయింట్ యూజ్ ఎయిర్పోర్ట్ను 1,500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. ఎయిర్ఫోర్స్ బేస్, శిక్షణ కేంద్రం, కార్యాలయాలు, టౌన్షిప్లు, నివాస సముదాయాలు కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందన్నారు. ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పౌర విమానయాన, రక్షణ శాఖల నోడల్ అధికారులను నియమించనున్నారు. మరోవైపు వరంగల్ విమానాశ్రయానికి సంబంధించిన డీపీఆర్ తయారీలో ఉందని, భవనాల లేఅవుట్ తుది దశలో ఉందని తెలిపారు.