ఉత్తరాంధ్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పండగలాంటి వార్త వినిపించింది. విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్ పరిధిని కేంద్రం నిర్ణయించింది. నాలుగు డివిజన్లతో విశాఖపట్నం రైల్వేజోన్ పరిధిని నిర్ణయించింది. అలాగే వాల్తేరు డివిజన్ను పేరును విశాఖపట్నం డివిజన్గా పేరుమార్చింది. విశాఖ రైల్వే డివిజన్ పరిధిలోనూ మార్పులు చేసింది. విశాఖ రైల్వే డివిజన్ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్ పరిధిని నిర్ణయించింది. దక్షిణకోస్తా రైల్వేజోన్ పరిధిలో విశాఖపట్నం డివిజన్తో పాటుగా విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఉండనున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.