వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహాముత్తారం మండలం ములుగుపల్లి-అంశాపూర్ మధ్య రాజు అనే యువకుడు బైక్తో వాగు దాటే ప్రయత్నంలో కొట్టుకుపోయాడు. ఈత రావడంతో అతడు ప్రాణాలతో బయటపడినప్పటికీ.. బైక్ మాత్రం వరదలో కొట్టుకుపోయింది. ప్రజలు అనవసర సాహసాలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.