ఉద్యోగంలో చేరిన తొలిరోజే ఓ యువకుడు సంస్థకు టోపీ పెట్టాడు. బేగంపేటలోని జెప్టో కార్యాలయంలో స్టోర్ప్యాకర్గా చేరిన యువకుడు గుట్టు చప్పుడు కాకుండా రెండు ఐఫోన్లు కొట్టేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీటీవీ పరిశీలించిన స్టోర్ యాజమాన్యం చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.