రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త అందించింది. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను విడుదల చేసింది. తాజాగా రూ.745 కోట్ల పెండింగ్ బిల్లులను రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాలకు అందాల్సిన నిధులు భారీగా పేరుకుపోవడంతో.. వాటిని దశల వారీగా విడుదల చేయాలని నిర్ణయించిన సర్కార్.. తాజాగా రిలీజ్ చేసింది.