తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ హాట్గా విమర్శలు, ఆరోపణలు నడుస్తున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలంతా.. ఉపఎన్నికలకు సిద్ధం కావాలని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. ఫిరాయింపు ఎమ్మె్ల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ.. కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.