ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓట్లు అమ్ముకున్నారు: కౌశిక్ రెడ్డి

5 months ago 10
ఇటీవల జరిగిన ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని మండిపడ్డారు. ఇండియా కూటమికి 315 ఓట్లు ఉండగా.. వారి అభ్యర్థఇ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే పడ్డాయని.. మ‌రి 15 ఓట్లు ఎటు వెళ్లాయని ప్రశ్నించారు. తెలంగాణలోని 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ఓట్లు వేశారని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయ్యాక తాము బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేశామని కాంగ్రెస్ ఎంపీలు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, నితిన్ గడ్కరీలను కలిశారని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ 8 మంది ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిశారని.. క్రాస్ అయిన 15 ఓట్లలో 8 ఓట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలవేనని పాడి కౌశిక్ రెడ్డి వెల్లడించారు.
Read Entire Article