వేసవి ముగియకముందే తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్తో సహా ఉమ్మడి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.