పల్లెల్లో ఎవరూ ఉపాధి లేకుండా ఖాళీగా ఉండకుండా.. కనీసం సంవత్సరంలో 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉపాధి కూలీలకు వెళ్లిన కొంతమంది దురదృష్టవశాత్తు చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో వారికి బీమా పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల పరిహారం లభించనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.