తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి సీతక్క తెలిపారు. క్షేత్ర స్థాయిలో పని చేసే చిరుద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తమకు కూడా పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ ఉపాధి హామీ సిబ్బంది మంత్రి సీతక్కను కలిశారు. దీనిపై ఫైల్ సిద్ధం చేయమన్న సీతక్క.. కేబినెట్ ముందుకు తీసుకు వెళ్లి చర్చిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..