Mgnrega Workers Ekyc Must: ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న మస్టర్ల మోసాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి కూలీకి ఈకేవైసీ తప్పనిసరి. రోజుకు రెండుసార్లు ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలి. ఒకరి బదులు మరొకరు పనికి వస్తే జీతం రాదు. జాబ్కార్డులకు ఆధార్ అనుసంధానం కూడా చేస్తున్నారు. అక్టోబరు 1 నుంచి అమలు కానున్న ఈ కొత్త విధానం అక్రమాలను ఎంతవరకు అరికడుతుందో చూడాలి.