విజయనగరం జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తవలస మండలంలోని కాటకాపల్లిలో ఉపాధి హామీ పనులలో బాంబు పేలుడు సంభవించింది. ఉపాధి కూలీలు పనిచేస్తున్న సమయంలో భూమిలో పాతిపెట్టిన నాటుబాంబు అకస్మాత్తుగా పేలింది. పనిలో భాగంగా కూలీలు గునపం వేయగానే.. లోపల ఉన్న బాంబు పేలింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వీరిని పెందుర్తి ఆస్పత్రికి తరలించారు.