Telangana Education Department: తెలంగాణలో విద్యా రంగం నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యను అందిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. అవి కేవంల మాటలకు మాత్రమే పరిమిత అయ్యాయన్నారు. కొన్ని వేల ఉపాధ్యాయ నియామకాలు నిలిచిపోయాయని చెప్పారు. తమ ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా నిధులు కేటాయిస్తూ.. ఉపాధ్యాయులను గౌరవంగా చూసి విద్యను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. అంతే కాకుండా.. పాఠశాల టీచర్లు ఇక నుంచి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు.