హైదరాబాద్ ఉప్పల్ స్డేడియం భవిష్యత్తు ప్రమాదంలో పడింది. స్టేడియం చుట్టూ ఉన్న కీలకమైన పార్కింగ్, ప్రవేశ మార్గాలు బిల్డ్ బ్రిక్స్ అనే ప్రైవేట్ సంస్థ చేతికి వెళ్లాయి. ఈ సంస్థ ఆ ఖాళీ స్థలంలో ప్రహరీ గోడలు నిర్మిస్తూ.. ఐదు గేట్లను మూసివేస్తోంది. ఈ పరిస్థితితో మ్యాచ్ల నిర్వహణ కష్టతరమై, స్టేడియం ఖ్యాతికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.