Pawan Kalyan 323 Cr Lifeline for Uppada Sea Wall Project: ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మద్రాస్ ఐఐటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ మేరకు ఎంవోయూ కుదిరింది. ఒప్పందం మేరకు రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్ పర్యవేక్షించనుంది. రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం చేపట్టనుండగా.. నవంబర్ నుంచి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.