Gajalakshmi pulls chariot at Gavimatham Rathotsavam: ఉరవకొండ గవిమఠం రథోత్సవంలో అద్భుత ఘటన చోటుచేసుకుంది. రథోత్సవం జరుగుతున్న సమయంలో రథం మధ్యలో ఆగిపోయింది. అయితే ఇదే సమయంలో గవిమఠం ఏనుగు గజలక్ష్మి రంగప్రవేశం చేసి.. తల, తొండంతో రథాన్ని తోయటం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు ఆనందం, ఆశ్చర్యంతో పరవశించిపోయారు. శివనామస్మరణతో మరింత హుషారుగా రథాన్ని ముందుకు లాగటంతో కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తయ్యింది.