Anantapur Srinivasulu Five Govt Jobs: పేదరికం చదువుకు అడ్డుకాదని నిరూపిస్తూ, చేనేత కార్మికుల కుమారుడు శ్రీనివాసులు ఏపీ డీఎస్సీలో ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించి సంచలనం సృష్టించాడు. తొలి ప్రయత్నంలో ఓటమి పాలైనప్పటికీ, పట్టుదలతో చదివి గణితం స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. రైల్వే ఉద్యోగాలు వచ్చినా ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో వాటిని వదులుకున్నాడు. రాధాకృష్ణ మాస్టారు సహాయంతో విజయం సాధించిన శ్రీనివాసులు ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచాడు.