మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న ఉల్లి రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా క్వింటాల్ ఉల్లిని రూ.1200 చొప్పున కొనుగోలు చేయించాలని నిర్ణయించింది. ఒక వేళ వ్యాపారులు ఆ మొత్తం చెల్లించకపోతే, మిగతా మొత్తాన్ని రైతులకు ప్రభుత్వమే చెల్లించనుంది. ఇందుకోసం ధరల స్థిరీకరణ నిధి నుంచి రూ.10 కోట్లు మార్క్ ఫెడ్కు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.