ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం కోసం అడుగులు పడుతున్నాయి! శిథిలావస్థలో ఉన్న పాత ఆస్పత్రిని గోషామహల్లోని శివకుమార్ లాల్ స్టేడియం ప్రాంతానికి తరలించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. 31 ఎకరాల భూమిని ఆస్పత్రికి కేటాయించగా, నగర పోలీస్ కమిషనర్ వైద్యశాఖకు స్థలాన్ని అప్పగించారు. రోడ్ల విస్తరణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మార్పు నగర ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందించనుందో వేచి చూడాల్సిందే!