ఆంధ్రప్రదేశ్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నాలుగు చిన్నారిని పందికొక్కులు కొరికి చంపాయి. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగు నెలల బాలుడిని ఇంట్లో పడుకోబెట్టి తల్లి టిఫిన్ కోసం వెళ్లిన సమయంలో.. ఈ దారుణం చోటుచేసుకుంది. హోటల్ నుంచి టిఫిన్ తీసుకుని ఇంటికి వచ్చిన తల్లికి.. చిన్నారిని పందికొక్కులు కొరుకుతూ ఉండటం కనిపించింది. పందికొక్కుల దాడిలో అప్పటికే తీవ్ర గాయాలు కాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే నాలుగు నెలల బాలుడు కన్నుమూశాడు.