హైదరాబాద్ ఎంఎంటీఎస్ సేవలపై సంబంధిత అధికారులతో కలిసి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆఫీస్ టైమ్స్లో ట్రైన్ల సంఖ్య పెంపుపై ఆదేశాలు జారీ చేశారు. చివరి స్టేషన్ వరకు కనెక్టివిటీ అందించేందుకు కీలక సూచనలు చేశారు. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తే.. నగరవాసులు ఎంఎంటీఎస్పై ఆసక్తి చూపిస్తారని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా నగరవాసులు ఎంఎంటీఎస్ రైళ్లు ఎక్కడం తగ్గించడంపై అధికారుల నుంచి వివరాలను సేకరించారు.