తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతివి విమర్శల సాగుతున్నాయి. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్పై మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ విమర్శలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా, 2004లో వరంగల్ ఎంపీగా పనిచేసిన రవీంద్ర నాయక్ తర్వాత బీఆర్ఎస్ను వీడారు. తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లారు. అయితే, కాంగ్రెస్ను వీడి 2019లో బీజేపీలో చేరారు. అయితే, మళ్లీ లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్లో చేరారు.