నల్లగొండలో ఉగ్రవాదులకు మూలాలున్నాయని, ఇది వామపక్ష తీవ్రవాదానికి, ఐఎస్ఐ తీవ్రవాదానికి అడ్డాగా మారిందని మెదక్ లోక్సభ సభ్యులు రఘునందన్ రావు ఆరోపించారు. మదర్సాల పేరుతో జీహాద్ జరుగుతోందని, వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయని ఆరోపించారు. స్కూళ్లు, కాలేజీలను తనిఖీ చేసినట్టు కలెక్టర్లు, ఎస్పీలు మదర్సాలను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు.