గంజాయి స్మగర్ల అరాచక దాడిలో మృతి చెందిన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంది. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆమె కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియా అందించగా.. తాజాగా సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పిస్తూ జిల్లా కలెక్టర్ అపాయింట్మెంట్ లెటర్ అందించారు.