తెలంగాణలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అవసరమైన మేర యూరియా నిల్వలు లేకపోవడం, కేంద్రం నుంచి సరఫరా ఆలస్యం కావడమే దీనికి ప్రధాన కారణం. దీంతో రైతులు యూరియా కోసం ఎక్కడ చూసినా పెద్ద క్యూలలో వేచి ఉంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఆయన కృషి వల్ల యూరియా సరఫరాకు కేంద్రం అంగీకరించిందని మంత్రి తెలిపారు.