తెలంగాణ ప్రభుత్వం కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరును మార్చుతూ తాజాగా జీవో (GO) విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును ఇకపై మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంగా పిలవనున్నారు. ఈ పథకం నీటిని మక్తల్ మండలంలోని భూత్పూర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి తీసుకుంటున్నందున.. పేరులో మక్తల్ను చేర్చాలని మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పట్టుబట్టారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే ఆయన చేసిన ఈ డిమాండ్ను, మంత్రి హోదాలో పట్టుబట్టడంతో ప్రభుత్వం ఆమోదించింది. ఈ మార్పు ఆ మూడు నియోజకవర్గాలకు రాజకీయ ప్రాధాన్యతను పెంచింది.