రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం, మంగళపల్లి గ్రామ ప్రజల కల నెరవేరింది. దశాబ్దాలుగా సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడిన గ్రామస్తుల కోసం ఇప్పుడు రూ.1.30 కోట్లతో తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇచ్చిన హామీ ప్రకారం మూడు నెలల్లోనే పనులు పూర్తి చేశారు. వ్యవసాయంపై ఆధారపడిన ఈ గ్రామంలో... రైతులు తాము పండించిన పంటలను మార్కెట్కు సులభంగా తరలించడానికి ఈ కొత్త రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది.