ఎట్టకేలకు తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది. గవర్నర్ ఆమోదం తెలపడంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లతో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఏ సమయంలో అయినా వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా.. రిజర్వేషన్ల విషయంలో 50 శాతం సీలింగ్ ఎత్తివేస్తూ ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోగా.. దీనిపై కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. పంచాయితీ రాజ్, మున్సిపల్ సవరణలకు గవర్నర్ నుంచి ఆమోదం లభించింది.