మెదక్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య అనేది రోజురోజుకూ పెరిగిపోతోంది. రెండు జాతీయ రహదారులు పట్టణం గుండా వెళ్తుండటం.. బైపాస్ రోడ్డు లేకపోవడంతో స్థానిక ప్రజలతో పాటు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీని కారణంగా ట్రాఫిక్ రద్దీ పెరగడమే కాకుండా.. ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జిల్లా వాసులకు శుభవార్త చెప్పింది. బైపాస్ రహదారి నిర్మాణం కోసం సమగ్ర నివేదిక (DPR) సిద్ధం చేసేందుకు బిడ్లు ఆహ్వానించింది. దీంతో త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.