ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ.. ముగ్గురు మృతి..

5 months ago 9
మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలంలో రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వనపర్తి జిల్లాకు చెందిన ముగ్గురు ప్రయాణికులు భూత్పూరు వైపు వెళ్తుండగా.. కొత్తమొల్గర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఎదురుగా వస్తున్న మరొక ఆటోను ఢీకొన్నాడు. ఈ ఘటనలో వంశీ, నర్సింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడే తీవ్రగాయాలు పాలైన సక్రిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article