ఎన్టీఆర్ జిల్లాలోని వినగడప వేణుగోపాలస్వామి ఆలయ భూముల వ్యవహారంలో ఏపీ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆలయానికి చెందిన సుమారు వేయి ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ పంపారు. అయితే ఈ భూముల నుంచి ఆలయానికి రావాల్సిన టాస్డిక్ అలవెన్స్ ఎవరు చెల్లిస్తారనేదీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.