వేములవాడలో 54 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రధాన రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. మూలవాగు వంతెన నుంచి ఆలయం వరకు 80 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ జరుగుతుంది. పెరుగుతున్న భక్తుల, జనాభా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో పనులు మొదలయ్యాయి. రూ. 47 కోట్లు నష్టపరిహారానికి కేటాయించగా.. ఇప్పటికే 100 మందికి చెక్కులు అందాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.