నల్గొండ జిల్లాలో సంచలనం చోటు చేసుకుంది. ఎమ్మార్వోను అరెస్ట్ చేయాలంటూ మానవ హక్కుల కమిషన్ వారెంట్ జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో కమిషన్ విచారణ జరిపి ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే కమిషన్ ఆదేశాలను పట్టించుకోకుండా.. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.