రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక ఆరోపణలు.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన వేళ.. జనసేన పార్టీ చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో నిజానిజాలు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించగా.. ఆ కమిటీ విచారణ ప్రారంభించింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వెంటనే వివరణ ఇవ్వాలని పార్టీ శాసనసభా పక్షం ఆదేశించింది. ఈ విచారణ నివేదిక ఆధారంగా పవన్ కళ్యాణ్ తీసుకునే కఠిన నిర్ణయంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.