అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీకి చేదు అనుభవం ఎదురైంది. గార్లదిన్నె మండలం కణంపల్లి పర్యటనలో సొంత పార్టీ కార్యకర్త కుటుంబం నుంచే ఆమెకు నిరసన సెగ తగిలింది. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిస్తామని గతంలో హామీ ఇచ్చి.. అడుగుతుంటే ఇప్పుడు అక్రమ కేసులు పెట్టించారంటూ ప్రసాద్ అనే టీడీపీ కార్యకర్త, అతని కుటుంబం ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఒక మహిళ ఆవేశంతో పోలీసులను నెట్టుకుని.. ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించటంతో ఉద్రిక్తత తలెత్తింది.