కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సొంత గ్రామంలోనే ఎదురుదెబ్బ తగిలింది. చర్లపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి నాగిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డి వేధింపులు తాళలేకనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. గతంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డి కూడా ఝాన్సీ రెడ్డిపై విమర్శలు చేశారు. నియోజకవర్గంలో ఆమె పెత్తనం ఎక్కువైందని, ఎమ్మెల్యేకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన అన్నారు.